Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

మన తెలుగు సాంప్రదాయం-మన ఉగాది


                             తెలుగు  సంప్రదాయానికి ప్రతీక.... మన ఉగాది

తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చేదే ఉగాది.అంతే కాదు.అంతకు ముందున్న స్లేషం,వాతపు నొప్పులు,అస్తవ్యస్తంగా ఉన్న మన ఆరోగ్యానికి క్రొత్త జీవాన్ని ఇచ్చే సందడి ఈ పర్వ దినం. వీటిన్నిoటితో పాటు ఉగాదికి మరో ప్రాముఖ్యం ఉంది.ఈ [పండుగకు మాత్రమే తినేది ఉగాది పచ్చడి తీపి,పులుపు,కారం,ఉప్పు,వగరు,చేదు అనే ఆరు రుచుల కలిసిన ఉగాది పచ్చడిని తింటాం

  " మాసానాం మార్గశిర్మోహం...రుతూనాం కుసుమాకర... అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పారు.మాసాల్లో మార్గశిర మాసం రుతువుల్లో వసంత రుతువు ఉత్తమమైనది.మన పండుగలు అన్ని రుతువులఫైనే ఆధారపడి ఉంటాయి.ఉగాది వసంత రుతువులో వస్తుంది.అ రోజుల్లో ప్రకృతి అత్యంత రమణియంగా ఉంటుంది.తరుశాఖల చిగురులు.. పక్షుల కిల కిలారావాలు.. మామిడి చిగుళ్ళును ఆస్వాదించిన కోకిలల ఆలావనలు..అలా పరవశించిన ప్రకృతి ఒడిలో అందరూ ఉగాది సంబరాలు జరుపుకొంటారు ఉగాది పండుగ రావడంతో తెలుగిళ్ళు కళ కళలాడుతుంటాయి.ఎవరెన్ని కష్టాల్లో ఉన్నప్పిటికీ ఆ రోజున మాత్రం ఆనందంగా గడుపుతారు.ఎందుకంటే ... సంవత్సరం ప్రారంభం రోజున ఎలా ఉంటె... సంవత్సరం అంతా అలానే ఉంటారనేది నమ్మకం


               ఉగాది పచ్చడి- ప్రాముఖ్యం

ఉగాదినాడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి.నూతన వస్త్రాలను ధరించాలి.గడపకు పసుపు కుంకుమ,గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి.భగవంతున్ని ప్రార్ధిoచాలి. ప్రధానంగా ఉగాది రోజున భగవంతుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి ఉంచడం తప్పనిసరి.


 క్రొత్త నిర్ణయాలు తీసుకొనేందుకు పంచాంగా శ్రవణం చేయడం ఉగాది నాడు విశిష్టత.పంచాంగం అంతే అయిదు అంగములు అని అర్ధం.తిధీ,వారం,నక్షత్రం,యోగం,కరణం అనేవి ఆ అయిదు అంగాలు 15 తిధులు,7 వారాలు,27 నక్షత్రములు,27 ,11కరణములు ఉన్నాయి.వీటిన్నిoటిని తెలిపేదే పంచాంగం.వీటిని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు అంటుoటారు.






No comments:

Post a Comment